మరో రెండు ఎగ్జిట్ పోల్స్ విడుదల.. అనూహ్యంగా దూసుకొచ్చిన ఆ పార్టీ
జమ్ము కశ్మీర్, హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జమ్ము కశ్మీర్లో 90 సీట్లకు, హర్యాణాలో 90 సీట్లకు శనివారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది.
దిశ, వెబ్డెస్క్: జమ్ము కశ్మీర్, హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జమ్ము కశ్మీర్లో 90 సీట్లకు, హర్యాణాలో 90 సీట్లకు శనివారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కు సంపూర్ణ మెజార్టీ ఇచ్చాయి. జమ్ము కశ్మీర్, హర్యాణా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్దే హవా ఉన్నట్లు తెలిపింది. తాజాగా.. మరో రెండు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఇందులో అనూహ్యంగా బీజేపీకి అధిక సీట్లు వస్తాయని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
జమ్ము కశ్మీర్ (90) ఎన్నికల ఎగ్జిట్ పోల్స్:
రిపబ్లిక్ మ్యాట్రిజ్: పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఎన్సీ 15, ఇతరులు.
దైనిక్ భాస్కర్: బీజేపీ 20-25, కాంగ్రెస్-ఎన్సీ 35-40, పీడీపీ 4-7, ఇతరులు 12-16.