jagdeep Dhankhar: ఈశాన్య రాష్ట్రాలు దేశానికి హృదయం వంటివి.. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

ఈశాన్య రాష్ట్రాలు దేశానికి హృదయం లాంటివని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అభివర్ణించారు.

Update: 2024-10-05 15:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రాలు దేశానికి హృదయం లాంటివని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అభివర్ణించారు. పర్యాటక అభివృద్ధిలో ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలపై జాతీయ కథనాలను రూపొందించడంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఈశాన్య రాష్ట్రం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. విమానాశ్రయాల సంఖ్య, ఇతర కనెక్టివిటీలు పెరగడంతో ఈశాన్య ప్రాంతంలో విశేషమైన మార్పు వచ్చిందన్నారు. ఇటీవలి కాలంలో విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో పాటు జలమార్గాలు విస్తరించాయన్నారు. ఫలితంగా దేశంలో పెట్టుబడులు ఆకర్షించినట్టు తెలిపారు. టూరిజం అభివృద్ధి చెందితే ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలే మారుతాయని తెలిపారు.  


Similar News

టమాటా @ 100