CBI దూకుడు.. నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి

Update: 2024-07-09 12:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి బీహార్‌లో మరో ఇద్దరు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా సీబీఐ అరెస్ట్ చేసిన వారిలో ఒకరు నీట్ పరీక్ష రాసిన అభ్యర్థి కాగా, మరో నిందితుడు నీట్ పరీక్ష రాసిన ఓ అభ్యర్థి తండ్రి. తాజా అరెస్ట్‌లతో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కు చేరింది. కాగా, నీట్ పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కుల కేటాయింపు దేశంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ నీట్ ఇష్యూకు సంబంధించి మొత్తం ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. బీహార్‌లోని ఎఫ్‌ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించింది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందినవి అభ్యర్థుల మోసానికి రిలేటేడ్ కేసులు. తాజా అరెస్టులతో నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్‌ల 11కు చేరింది. బీహార్‌లో 8 మంది, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరాండ్ రాష్ట్రాలలో ఒక్కొక్కరిని సీబీఐ అరెస్ట్ చేసింది. 


Similar News