రూ.2100 కోట్లు విలువ చేసే డ్రగ్స్, మద్యం ధ్వంసం చేసిన సీఎం

అస్సాం ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతోంది. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణా, స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని

Update: 2024-06-26 14:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతోంది. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణా, స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం హిమాంత బిస్వా శర్మ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు రాష్ట్రంలో మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కిడిక్కకడ తనిఖీలు చేసి పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు సీజ్ చేసిన రూ.2100 కోట్ల విలువ చేసే డ్రగ్స్, అక్రమ మద్యాన్ని సీఎం హిమాంత బిస్వా శర్మ ధ్వంసం చేశారు.

స్వయంగా రోడ్డు రోలర్ నడిపి మద్యం బాటిళ్లు, డ్రగ్స్‌ను సీఎం హిమాంత బిస్వా శర్మ ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా సీఎం బిస్వా శర్మ మాట్లాడుతూ.. అస్సాంను డ్రగ్ ఫ్రీ స్టేట్ మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. ఎవరైనా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం సరఫరా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మాదకద్రవ్యాల ముప్పులేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించే డ్రగ్ రహిత రాష్ట్రం అస్సాంను తీర్చిదిద్దుతామని తెలిపారు. 

 


Similar News