జమ్మూలో మరోసారి ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ మృతి

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి జరిగింది.

Update: 2024-08-19 13:25 GMT

దిశ , వెబ్ డెస్క్ :  జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల అనంతరం తనిఖీలు ముమ్మరం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది, జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కు చెందిన సంయుక్త బలగాలు తనిఖీ ఆపరేషన్స్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. భారత బలగాలు కూడా తిరిగి దాడులు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో సీఆర్పీఎఫ్ బలగాలకు చెందిన ఒక ఇన్స్పెక్టర్ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలును మోహరించామని, ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని అన్నారు.    


Similar News