సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(సీపీఐఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(సీపీఐఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్లో ఆయన చికిత్స పొందుతున్నారు. గత కొద్దిరోజులుగా వెంటిలేటర్పై ఏచూరికి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఆయన అనారోగ్యంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ‘సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉంది. వామపక్ష ఉద్యమాలకు ఏచూరి ఒక ఐకాన్.. ఏచూరి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. ఎన్నో సమస్యలపై ఏచూరి పోరాటం చేశారు.. ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నాడు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.