'కాంగ్రెస్ సిగ్గుపడాలి.. క్షమాపణలు చెప్పాలి'

Update: 2023-09-23 16:57 GMT

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ పరోక్షంగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై హర్యానా బీజేపీ చీఫ్ ఓపీ ధన్ ఖర్ శనివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి. ఆ పార్టీ సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఉదయ్ భాన్ అసభ్యంగా మాట్లాడటంలో అన్ని హద్దులను చెరిపేశాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. చేసిన వ్యాఖ్యలను అతడు సమర్థించుకోవడం’’ అని ఆయన కామెంట్ చేశారు. ‘‘లోక్ సభలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేచి నిలబడి.. ఆ వ్యాఖ్యలను ఆపించారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ను ఆపేందుకు హస్తం పార్టీ మాత్రం చొరవచూపడం లేదు’’ అని పేర్కొన్నారు.


Similar News