గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన శశిథరూర్ పీఏ!.. అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు

కాంగ్రెస్ సీనియర్ నేత,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పీఏ శివ కుమార్ ప్రసాద్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Update: 2024-05-30 05:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పీఏ శివ కుమార్ ప్రసాద్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా గోల్డ్ తీసుకొస్తుండగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టర్మినల్ 3 వద్ద కస్టమ్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని రిసీవ్ చేసుకునేందుకు శివకుమార్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే సుమారు 500 గ్రాముల బంగారాన్ని దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి ప్రసాద్‌కు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు సమాచారం. అనంతరం శివకుమార్ సహా మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బంగారం విలువ సుమారు 30లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. బంగారాన్ని భారత్‌కు ఎందుకు తీసుకువస్తున్నారని ఆరా తీశారు. 


Similar News