Bihar: మరో ఘోర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి

యూపీ తొక్కిసలాట ఘటన మరవకముందే దేశంలో మరోసారి తొక్కిసలాట జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్రమైన విషాద సంఘటన బీహార్ లోని జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లో చోటు చేసుకుంది.

Update: 2024-08-12 01:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూపీ తొక్కిసలాట ఘటన మరవకముందే దేశంలో మరోసారి తొక్కిసలాట జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్రమైన విషాద సంఘటన బీహార్ లోని జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం ఈ తొక్కిసలాట జరగ్గా ఏడుగురు మృతి చెందారు. అలాగే 9 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పవిత్ర సావన్ మాసంలోని నాలుగో సోమవారం కావడంతో భక్తులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాగా ప్రస్తుతం ఆలయంలో పరిస్థితి నిలకడగా ఉందని ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో 35 మందికి గాయాలు అయినట్లు స్థానిక పోలీస్ అధికారి చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల యూపీలోని హత్రాస్ ప్రాంతంలో ఒ సత్సంగ్ సమావేశంలో తొక్కిసలాట జరిగి ఏకంగా 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News