Road accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలిలోని ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.

Update: 2024-09-12 07:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలాడుతురైకి చెందిన మహమ్మద్ అన్వర్ తన కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమం నిమిత్తం చెన్నయ్ వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా చిదంబరంలోని పీ ముట్లూరు వంతెనపై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీనీ ఢీకొట్టింది. దీంతో చిన్నారి సహా కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని మహ్మద్‌ అన్వర్, యాసర్ అరాఫత్, హజీరా బేగం, హరాఫత్నీషాగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Similar News