నేడు మరోసారి తెరుచుకోనున్న పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది నేడు మరోసారి తెరుచుకోనుంది.
దిశ, వెబ్డెస్క్: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది నేడు మరోసారి తెరుచుకోనుంది. రహస్య గది తెరిచేందుకు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా పండితులు టైం ఫిక్స్ చేశారు. ఈ నెల 14న తొలి 2 గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఆదివారం రత్న భాండాగారం తెరిచిన అధికారులు సమయాభావం వల్ల వెంటనే గదిని మూసేశారు. గదిలోని పెట్టెల్లో ఉన్న ఆభరణాల జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో గురవారం మరో సారి రహస్యగదిని తెరిచి ఆభరణాలను వేరే చోటుకు తరలించనున్నారు.
సంపదను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి.. ఈ భాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగించనున్నట్లు భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్, ఆలయ పాలనాధికారి అరవింద పాఢి తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యాక సంపదను మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు రహస్య గది తెరుస్తున్నందున శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచే భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు.