స్వయంగా రాసిన పాటతో దుర్గా మాతకు ప్రధాని మోడీ నివాళి...వైరల్ గా వీడియో

శరన్నవరాత్రులలో దుర్గామాతపై భక్తితో స్వయంగా పాట రాసిన ప్రధాని మోడీ తనలోని రచయితను ప్రజల ముందు ఆవిష్కరించారు.

Update: 2024-10-07 06:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : శరన్నవరాత్రులలో దుర్గామాతపై భక్తితో స్వయంగా పాట రాసిన ప్రధాని మోడీ తనలోని రచయితను ప్రజల ముందు ఆవిష్కరించారు. దుర్గామాత ఆరాధనకు తాను రాసిన ‘ఆవతి కలే’ అనే గర్బా సాంగ్‌ను మోడీ సోమవారం తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఈ సాంగ్ షేర్ చేస్తూ.. “ఇది నవరాత్రుల పవిత్ర సమయమని.. ప్రజలు మాత దుర్గా పట్ల భక్తితో ఐక్యంగా వివిధ మార్గాల్లో పూజలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ గౌరవం, ఆనందంతో ఆమె శక్తి, దయకు నివాళిగా నేను వ్రాసిన ఆవతి కలే అనే గర్బా ఇక్కడ ఉందని... ఆమె ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ప్రస్తుతం ఈ సాంగ్‌ నెట్టింట వైరల్ గా మారింది. దేవి నవరాత్రుల సందర్భంగా యావత్ దేశ ప్రజలు దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన అవతి కలే గర్బా సాంగ్‌ అమ్మవారి భక్తులతో పాటు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తుంది. 

https://x.com/narendramodi/status/1843146046215422410


Similar News