Pm modi: ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Update: 2024-09-29 17:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే ఖర్గే ఆరోగ్యంపై ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే స్పందించారు. వైద్య బృందం ఖర్గేను పరిశీలించిందని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాగా, కశ్మీర్‌లోని కథువా జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ వేదికపైనే ఖర్గే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు ఆయన ప్రసంగం ఆగిపోయింది. మరి కాసేపటికి ఆయన కోలుకున్న తర్వాత తిరిగి మాట్లాడి ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.


Similar News