లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా.. రాహుల్ గాంధీ ఫస్ట్ రియాక్షన్
18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు.
దిశ, వెబ్డెస్క్: 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి తరఫున ఓంబిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజల గొంతుకగా పార్లమెంట్ నిలుస్తుందన్నారు. ప్రతిపక్షం కూడా సభకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలను విపక్షం సభలో వినిపిస్తుందన్నారు. సభలో మా గొంతు వినిపించేందుకు మీరు సహకరించాలన్నారు. విపక్షాల గొంతు నొక్కేస్తే సభ సజావుగా సాగినట్లు కాదన్నారు.