Sharad Pawar : సీఎం అభ్యర్థి రేసులో నేను లేను : శరద్ పవార్

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఎన్‌సీపీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు.

Update: 2024-08-23 19:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఎన్‌సీపీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. తాను మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి తరఫున సీఎం అభ్యర్థి రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి ఎవరికీ సీఎం అభ్యర్థిత్వంపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని మార్చాలనేది మాత్రమే తమ ఏకైక లక్ష్యమన్నారు.

ఇటీవలే శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా శరద్ పవార్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని తానే అని ఉద్ధవ్ థాక్రేజీ ఎన్నడూ చెప్పుకోలేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదా ఎన్‌సీపీ (ఎస్పీ) నుంచి ఎవరైనా ఆ అభ్యర్థిత్వంపై ఆసక్తిని చూపిస్తే వారికి మద్దతు ఇవ్వడానికి కూడా ఉద్దవ్ రెడీగా ఉన్నారు’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.


Similar News