‘మహా’ డిప్యూటీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదం

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌లకు తృటిలో ప్రమాదం తప్పింది.

Update: 2024-07-17 15:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌లకు తృటిలో ప్రమాదం తప్పింది. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు వీరిద్దరు నాగ్‌పూర్ నుంచి గడ్చిరోలికి హెలికాప్టర్‌‌లో బయలుదేరారు. ప్రతికూల వాతావరణం కారణంగా టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్‌ దారి తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ సేఫ్‌గా ల్యాండ్ కాగలిగింది.  హెలికాప్టర్ దారి తప్పిన క్షణాల్లో తాను చాలా ఆందోళనకు గురయ్యానని డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తెలిపారు.

అదే హెలికాప్టర్‌లో తమతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ కూడా ఉన్నారని చెప్పారు. ‘‘మేఘాలు ఒక్కసారిగా కమ్ముకోవడంతో మేం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారి తప్పింది. ఆ సమయంలో నేనెంతో భయపడ్డా. దేవేంద్ర మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు. గతంలో ఇలాంటి ఆరు ప్రమాదాల నుంచి బయట పడ్డానని దేవేంద్ర చెప్పారు. ఇప్పుడు కూడా మనకేం కాదని ఆయన ధైర్యం చెప్పారు’’ అని అజిత్‌ వివరించారు.


Similar News