మరో వైద్య విద్యార్థినిపై లైంగికదాడి

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరవక ముందే దేశంలో మహిళలపై జరుగుతున్న మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి.

Update: 2024-08-19 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరవక ముందే దేశంలో మహిళలపై జరుగుతున్న మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ లో ఓ డెంటల్ విద్యార్థినిపై తన సుపీరియర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రోహ్తక్ లోని పీజీఐఎంఎస్ లో బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని, అదే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యూయేట్ చదువుతున్న విద్యార్థి ఈ నెల 16న కాలేజీ ముగిసిన తర్వాత కిడ్నాప్ చేశాడు. అదే రోజు అంబాలా, చండీఘడ్ లకు తీసుకువెళ్ళి శారీరక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు, న్యాయవాది సమక్షంలో విద్యార్థిని వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అయితే వారివురికి ముందే పరిచయం ఉన్నట్టు తమ దర్యాప్తులో తెలిసిందని అనరు పోలీసులు.  


Similar News