Kolkata Rape Case: కోల్కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం.. నేను ఏ తప్పు చేయలేదంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు
కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది.
దిశ, వెబ్డెస్క్: కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సంజయ్ రాయ్ చేసిన దురాగతం దేశాన్ని.. దేశ ప్రజల్ని కదిలించేసింది. అతడికి కఠిన శిక్ష విధించాలని కోరుతూ ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు సాగుతున్నాయి. కాగా డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితుడు సంజయ్ రాయ్కి సీబీఐ అధికారులు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అనుమతి కోరుతూ సీబీఐ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం అధికారులకు అనుమతి ఇచ్చింది.
అయితే విచారణలో భాగంగా CBI కోర్టులో సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం. పాలీగ్రాఫ్ టెస్ట్కు ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా.. అతడు భావోద్వేగానికి గురయ్యాడట. "నేను అమాయకుడిని. ఏ తప్పు చేయలేదు. నన్ను ఇందులో కావాలని ఇరికించారు. ఈ పరీక్షలో అసలు విషయం బయటపడుతుంది" అంటూ జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.. దీంతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.