Kerala : కేరళ సీఎం ఆఫీసు మాఫియాలా పనిచేస్తోంది : రాష్ట్ర విపక్ష నేత వి.డి.సతీశన్

దిశ, నేషనల్ బ్యూరో : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయం మాఫియాలా పనిచేస్తోందని రాష్ట్ర విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు వి.డి.సతీశన్ ఆరోపించారు.

Update: 2024-09-06 15:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయం మాఫియాలా పనిచేస్తోందని రాష్ట్ర విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు వి.డి.సతీశన్ ఆరోపించారు. సీఎం ఆఫీసుపై వెల్లువెత్తుతున్న వరుస ఆరోపణలను చూస్తుంటే ప్రతి ఒక్కరికి సందేహాలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సీఎం ఆఫీసు మాఫియా అడ్డాగా మారిందనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడిందన్నారు.

శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమంలో వి.డి.సతీశన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి పినరయి విజయన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పినరయి విజయన్ స్థానంలో మరో వ్యక్తిని సీఎంగా నియమించాలని సీపీఎం పార్టీని కేరళ కాంగ్రెస్ చీఫ్ కె.సుధాకరన్ కోరారు. ఒకవేళ సీపీఎం పార్టీ చొరవ చూపి సీఎంను మార్చకుంటే.. రాష్ట్ర ప్రజలే ఆ పనిచేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.


Similar News