'జై నరేంద్ర మోడీ.. జై హెడ్గేవార్'.. లోక్ సభలో బీజేపీ ఎంపీ స్లోగన్

ఎంపీల ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన నినాదాలు పొలిటికల్ దుమారం రేపుతున్నాయి.

Update: 2024-06-25 11:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. సోమవారం ప్రమాణం చేయకుండా మిగిలిన ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీలు చేస్తున్న నినాదాలు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేశాక జై పాలస్తీనా అంటూ చేసిన నినాదంపై అధికార పక్షం భగ్గుమన్న సంగతి తెలిసిందే. దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుండగానే లోక్ సభలో యూపీ ఘజియాబాద్ బీజేపీ ఎంపీ అతుల్ గార్గ్ చేసిన నినాదాలు సోషల్ మీడియాలో చర్చగా మారాయి. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన..‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జిందాబాద్, దీన్ దయాల్ ఉపాధ్యాయ జిందాబాద్, అటల్ బిహారీ వాజ్ పేయి జిందాబాద్, నరేంద్ర మోడీ జిందాబాద్’ అని స్లోగన్స్ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తూ తిరిగి వెనక్కి వచ్చి డాక్టర్ హెడ్గేవార్ జిందాబాద్ అని నినాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇవాళ అధికార, ప్రతిపక్షాల సభ్యులు పొటాపోటీగా నినాదాలతో లోక్ సభలో దద్దరిల్లింది. 

Tags:    

Similar News