Manipur: మణిపూర్‌లో దారుణం.. పాఠశాల బయట మహిళ కాల్చివేత..

మణిపూర్ మళ్లీ భగ్గుమన్నది.

Update: 2023-07-06 17:15 GMT

ఇంఫాల్: మణిపూర్ మళ్లీ భగ్గుమన్నది. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రెండు నెలల తర్వాత పాఠశాలలు పున:ప్రారంభించారు. అయితే.. స్కూళ్లు తెరిచిన రెండో రోజే ఓ పాఠశాల వెలుపల ఒక మహిళను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మాపావో, అవాంగ్ సెక్మాయ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ గ్రూపుల మధ్య కాంగ్ పోక్సి జిల్లాలో ఘర్షణను పోలీసులు భగ్నం చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగింది.

థౌబల్ జిల్లాలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన ఓ జవాన్ ఇంట్లో నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగులను అడ్డుకున్నందుకు ఏకంగా ఆయన ఇంటికే నిప్పు పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల నిషేధాన్ని ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. కాగా.. మణిపూర్ లో హింసాకాండ రెండు నెలలుగా తగ్గుముఖం పట్టకపోవడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్థానిక గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) డిమాండ్ చేసింది.


Similar News