పార్లమెంట్ సభ్యులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక ప్రకటన
ఎంపీలకు కేందప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: ఎంపీల(Mps)కు కేందప్రభుత్వం(Union Government) గుడ్ న్యూస్ తెలిపింది. వారి జీతభత్యాలతో పాటు పెన్షన్, అదనపు పెన్షన్ను సైతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును 2023, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు నెల జీతం రూ. లక్ష నుంచి లక్షా 24 వేలకు, అలాగే వారికిచ్చే దినసరి భత్యాన్ని రూ. 2 వేల నుంచి రూ. 2, 500కు పెంచింది.
మాజీ ఎంపీలకు సైతం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుభవార్త వినిపించింది. మాజీ ఎంపీల పెన్షన్ను నెలకు రూ. 25 వేల నుంచి రూ.31 వేలకు సవరించింది. ఐదేళ్లకుపైగా ప్రతి అదనపు సంవత్సరానికి అదనపు పెన్షన్ను రూ.2 వేల నుంచి రూ.2,500కు పెంచింది. చివరిగా 2018లో ఎంపీల జీతభత్యాలు పెంచింది. ప్రస్తుతం పార్లమెంట్లో లోక్ సభకు 543, రాజ్యసభకు 245 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరికీ ఈ తాజా పెంపు వర్తించనుంది. రోజు రోజుకు ఖర్చులు పెరుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.