Emirates Flight: ఎమిరేట్స్ విమానానికి తప్పిన పెను ముప్పు.. 320 మంది ప్రయాణికులు సేఫ్

పైలెట్ అప్రమత్తతతో విమానానికి పెను ప్రమాదం తప్పిన ఘటన చెన్నై ఎయిర్‌పోర్టు (Chennai Airport)లో చోటుచేసుకుంది.

Update: 2024-09-25 01:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: పైలెట్ అప్రమత్తతతో విమానానికి పెను ప్రమాదం తప్పిన ఘటన చెన్నై ఎయిర్‌పోర్టు (Chennai Airport)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై నుంచి దుబాయ్ (Dubai) వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం (Emirates Flight) బుధవారం తెల్లవారుజామున బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫ్లైట్‌లో ఇంధనాన్ని నింపారు. అనంతరం విమానం టేకాఫ్ (Take Off) చేసేందుకు పైలెట్ ఇంజిన్ ఆన్ చేయగా ఇంజిన్ లోపలి భాగం నుంచి ఉన్నట్టుండి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్ ఇంజిన్ ఆఫ్ చేసి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందజేశాడు. ఒకవేళ పైలెట్ ఆ విషయాన్ని గమనించకపోతే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 320 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 


Similar News