Champai Soren : గిరిజనులు, పేదల అభ్యున్నతే లక్ష్యం.. మా పార్టీ ఎజెండా అదే : చంపై సోరెన్

దిశ, నేషనల్ బ్యూరో : సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఇటీవలే ప్రకటించిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ మరో కీలక ప్రకటన చేశారు.

Update: 2024-08-24 15:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఇటీవలే ప్రకటించిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ మరో కీలక ప్రకటన చేశారు. గిరిజనులు, ఆదివాసీలు, పేదల అభ్యున్నతి కోసం పనిచేయడమే తన పార్టీ ఎజెండాగా ఉంటుందని ఆయన వెల్లడించారు. జార్ఖండ్ ప్రజలు మరోసారి తనను సీఎంగా చేస్తే రాష్ట్ర అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తానని చంపై సోరెన్ హామీ ఇచ్చారు. గిరిజనులు, ఆదివాసీలు, పేదల అభ్యున్నతి కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానన్నారు. శనివారం సెరాయికేలా ఖర్ సావన్ జిల్లా కేంద్రంలో జరిగిన తన అనుచరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జాతీయ స్థాయిలో జార్ఖండ్‌ ప్రతిష్ఠను పెంచేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. ‘‘జార్ఖండ్ నలుమూలల నుంచి ఎంతో మంది నన్ను సంప్రదించారు. నా పార్టీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని వ్యక్తపరిచారు. అందుకే రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నాను. ఏదైనా మిత్రపక్షం దొరికితే, ఎన్నికల కంటే ముందే దానితో పొత్తు పెట్టుకుంటాం’’ అని చంపై సోరెన్ స్పష్టం చేశారు. మిగతా అన్ని అంశాలపై వారం రోజుల తర్వాత పూర్తి స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు.


Similar News