BJP : బీజేపీ మిత్రపక్షాలకు కేటాయింపులు ఫుల్.. మాకేమో నిల్ : డీఎంకే

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై డీఎంకే ఎంపీ తిరుచి శివ పెదవి విరిచారు.

Update: 2024-07-23 18:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై డీఎంకే ఎంపీ తిరుచి శివ పెదవి విరిచారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో ఉదారంగా నిధులను కేటాయించారని ఆయన విమర్శించారు. వివక్షా పూరితంగా ఉంది కాబట్టే .. దీన్ని కేంద్ర బడ్జెట్ అని పిలువలేమన్నారు. ‘‘వరదలు, సైక్లోన్ వల్ల నష్టపోయి పరిహారం కోరుతున్న తమిళనాడు లాంటి రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. కానీ భవిష్యత్తులో వరద ముంపునకు గురయ్యే ముప్పు ఉన్న రాష్ట్రాలకు నిధులను కేటాయించారు.

ఈ బడ్జెట్‌ను దేశ ప్రయోజనాల కోణంలో కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో తయారు చేసినందు వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు’’ అని తిరుచి శివ వ్యాఖ్యానించారు. తమిళనాడును బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు.

Tags:    

Similar News