Blast: ఢిల్లీలో కలకలం.. సీఆర్‌పీఎఫ్ స్కూల్ సమీపంలో పేలుడు

ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. రోహిణీ జిల్లా ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది.

Update: 2024-10-20 04:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. రోహిణీ జిల్లా ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం 7:50 గంటల సమయంలో ఈ ఘటన జరగగా స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్కూల్ సరిహద్దు గోడ దగ్గర పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు తనిఖీలు చేపట్టాయి. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భారీగా పొగ వెలువడినట్టు స్థానికులు తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే పేలుడు వల్ల పాఠశాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నట్టు సమాచారం.


Similar News