BJP : నేడు దేశవ్యాప్తంగా బీజేపీ మీడియా సమావేశాలు

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ శనివారం రోజు (ఆగస్టు 24) బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు పెట్టనున్నారు.

Update: 2024-08-23 18:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ శనివారం రోజు (ఆగస్టు 24) బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు పెట్టనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్‌షా 10 ప్రశ్నలు సంధించారు. శనివారం రోజు బీజేపీ నేతలు ఏర్పాటు చేసే మీడియా సమావేశాల్లోనూ ఈ ప్రశ్నల గురించే ప్రస్తావించనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అంశాలకు కూడా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని కమలదళం నిలదీయనుంది.


Similar News