పీఎం కిసాన్ రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ తేదీ ఖరారు

మోడీ సర్కార్ రైతులకు భారీ శుభవార్త చెప్పింది.

Update: 2024-06-12 13:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ రైతులకు శుభవార్త చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 18న ప్రధాని మోడీ 17వ విడత సమ్మాన్ నిధిని విడుదల చేయబోతున్నారు. పీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఈ నెల 18న మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. 

Tags:    

Similar News