మూత్ర విసర్జన ఘటనపై పెయింటింగ్ పోస్ట్ చేసిన సింగర్పై కేసు..
మధ్యప్రదేశ్లో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను అద్దం పట్టే పెయింటింగ్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన భోజ్పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్పై కేసు నమోదైంది.
భోపాల్ : మధ్యప్రదేశ్లో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను అద్దం పట్టే పెయింటింగ్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన భోజ్పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్పై కేసు నమోదైంది. సూరజ్ ఖరే అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా భోపాల్లోని హబీబ్గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 153(A) (మతం, జాతి మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం) కింద నేహా సింగ్ రాథోడ్పై అభియోగాలను నమోదు చేశారు.
ఆమె పోస్ట్ చేసిన పెయింటింగ్లో అర్ధ నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి (బహుశా నిందితుడు ప్రవేశ్ శుక్లా).. మరో వ్యక్తి (బహుశా బాధితుడు దష్మేష్ రావత్) పై మూత్ర విసర్జన చేస్తున్నట్లుగా ఉంది. మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తి తెల్లటి హాఫ్ స్లీవ్ షర్ట్, తలపై నల్లటి టోపీలు ధరించి.. ఖాకీ షార్ట్ను పక్కన పెట్టుకుని కనిపించాడు. ఈ వివాదాస్పద పోస్టుకు సింగర్ నేహా సింగ్ రాథోడ్.. “ఎంపీ మే కా.. బా..? (ఎంపీలో ఏమి జరుగుతోంది) త్వరలో వస్తుంది” అనే క్యాప్షన్ పెట్టారు.
M P में का बा..?
— Neha Singh Rathore (@nehafolksinger) July 6, 2023
Coming Soon.. #comingsoon #nehasinghrathore #प्रवेश_शुक्ला #ArrestPraveshShukla #politics #humanity #Shameless #women #upcoming pic.twitter.com/0suKLF9A87