Babita Phogat: ఫొగట్ ఫ్యామిలీలో భూపేంద్ర హుడా విభేదాలు సృష్టించారు.. బబితా ఫొగట్

రెజ్లర్ వినేష్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరడంపై రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫొగట్ స్పందించారు.

Update: 2024-09-10 18:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రెజ్లర్ వినేష్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరడంపై రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫొగట్ స్పందించారు. వినేష్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయితే ఫొగట్ కుటుంబంలో కాంగ్రెస్ సీనియర్ నేత భూపేంద్ర హుడా విభేదాలు సృష్టించారని ఆరోపించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విభజించి పాలించడమే కాంగ్రెస్‌ విధానమని, వారు ఎప్పటి నుంచో ఇదే పని చేస్తున్నారని మండిపడ్డారు. హర్యానా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. వినేష్ ఫోగట్ తన గురువు మహావీర్ సలహాను తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రెజ్లింగ్ కెరీర్‌పై దృష్టి సారించి ఉంటే.. వచ్చే ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాకపోవడంపై బబితా స్పందిస్తూ.. టికెట్ రానందుకు బాధ లేదన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. కష్టపడి పని చేసి కమలం వికసించేలా కృషి చేస్తానని చెప్పారు. హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని దీమా వ్యక్తం చేశారు.


Similar News