BREAKING: జమ్మూ కశ్మీర్లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్ట్లు హతం
జమ్మూ కశ్మీర్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం యూరి సెక్టార్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.
దిశ, వెబ్డెస్క్: జమ్మూ కశ్మీర్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం యూరి సెక్టార్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్లు హతం కాగా, కొందరు జవాన్లకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, యూరి సెక్టర్ గుండా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రణాళిక వేశారన్న ఇంటలిజెన్స్ సమాచారంతో ఇండియన్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే యూరి సెక్టార్లో భద్రతా దళాలు శనివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా టెర్రరిస్ట్లు ఎదురు పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఎన్ కౌంటర్లో భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి.. టెర్రరిస్ట్ల చొరబాటును తిప్పికొట్టింది. ప్రస్తుతం యూరి సెక్టార్లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు సామాన్య పౌరులు, సైన్యంపై దాడులకు తెగబడుతున్నారు. ఉగ్రవాదుల మూవ్వెంట్ పెరిగిన నేపథ్యంలో భారత సైన్యం కూడా అప్రమత్తమై.. ఎక్కడిక్కకడ టెర్రిరిస్టుల ప్లాన్ను భగ్నం చేస్తున్నాయి.