కశ్మీర్ లోయలో అమిత్షా సుడిగాలి ప్రచారం
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కశ్మీర్ లోయలో అమిత్షా సుడిగాలి ప్రచారం నిర్వహించారు.
దిశ, వెబ్డెస్క్: జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. కశ్మీర్ లోయలో అమిత్షా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 18న కశ్మీర్లో తొలి విడత పోలింగ్ లో భాగంగా.. చినాబ్ వ్యాలీలో 24 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు అమిత్ షా.. మూడు సభల్లో పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీ(BJP).. ఆ దిశగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే మొదట మోడీ, ఆ తర్వాత అమిత్ షా వరుసగా ప్రచారం నిర్వహించారు. ఈ రోజు మూడు సభల్లో పాల్గోన్న అమిత్షా.. కాంగ్రెస్, NC కూటమిపై మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్, NC కూటమి అధికారంలోకి వస్తే.. మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతారని సూచించారు. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాతిపెడతుందని.. అమిత్ షా హామీ ఇచ్చారు.