ఇండియా హిందూ దేశం.. ఇదే నిజం : RSS chief Mohan Bhagwat

భారత్ హిందూ దేశమని, సైద్ధాంతికంగా భారతీయులంతా హిందువులేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

Update: 2023-09-01 16:14 GMT

నాగ్ పూర్ : భారత్ హిందూ దేశమని, సైద్ధాంతికంగా భారతీయులంతా హిందువులేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువులు అంటే భారతీయులందరూ అనే అర్ధం వస్తుందన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశంలో ఉన్నవారంతా హిందూ సంస్కృతికి, హిందూ పూర్వీకులకు, హిందూ భూమికి సంబంధించినవారే తప్ప మరేమీ కాదు. కొంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు.

ఇంకొందరు తెలిసినా తమ మూలాలను అనుసరించడం లేదు’’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత భావజాలానికి మంచి గౌరవం ఉందన్నారు. న్యూస్ రిపోర్టింగ్ లో ఉన్నవారంతా సంస్థ భావజాలాన్నిఅనుసరిస్తూనే.. నిష్పాక్షికంగా, వాస్తవికంగా సమాచారాన్ని పాఠకులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News