Rahul Gandhi: ఇంకెన్ని కుటుంబాలు బలి కావాలి? తమిళనాడు రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ

దేశంలో సంభవిస్తున్న రైలు ప్రమాదాలపై రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

Update: 2024-10-12 06:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో గత రాత్రి చోటు చేసుకున్న భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం గతేడాది ఒడిశాలో బాలాసోర్ లో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీ కొట్టిన ఘటనకు అద్దం పడుతోందని అన్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎన్ని ప్రాణాలు పోతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం గుణ పాఠాలు నేర్వడం లేదని, జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలని విమర్శించారు. ప్రభుత్వం మేల్కోవడానికి ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలని ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 


Similar News