Akhilesh : అఖిలేష్ నా కాల్స్ లిఫ్ట్ చేయలేదు.. మాయావతి కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : 2019 లోక్సభ ఎన్నికల తర్వాత బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీల కూటమి విచ్ఛిన్నం కావడానికి గల కారణాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో : 2019 లోక్సభ ఎన్నికల తర్వాత బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీల కూటమి విచ్ఛిన్నం కావడానికి గల కారణాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. ఆనాడు ఎన్నికల్లో కూటమి అంతగా రాణించలేకపోయిందని.. ఆ తర్వాత తాను సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్కు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. కనీసం తమ పార్టీ సీనియర్ నేతలతోనూ ఆయన టచ్లోకి రాలేదని బీఎస్పీ అధినేత్రి పేర్కొన్నారు. దీంతో తమ పార్టీ ప్రతిష్ఠను నిలిపేందుకు కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు మాయావతి వెల్లడించారు.
ఈమేరకు వివరాలతో ఒక బుక్లెట్ను బీఎస్పీ అధినేత్రి విడుదల చేశారు. తదుపరిగా జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహాల వివరాలను అందులో ప్రస్తావించారు. బీఎస్పీని రాజకీయంగా సుస్థిరంగా నిలిపేందుకు మాయావతి తీసుకున్న కీలక నిర్ణయాల గురించి బుక్లెట్లో వివరించారు.