రాజకీయాల్లోకి నటుడు షాయాజీ షిండే
విలక్షణ నటుడు షాయాజీ షిండే(Sayaji Shinde) రాజకీయాల్లో చేరారు.
దిశ, వెబ్ డెస్క్ : విలక్షణ నటుడు షాయాజీ షిండే(Sayaji Shinde) రాజకీయాల్లో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajith Pawar) నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్(NCP) పార్టీలో శుక్రవారం చేరారు. ఈ మేరకు షాయాజీ షిండే తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించారు. మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షిండే ఎన్సీపీలో చేరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎనికల్లో షిండే పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా విభిన్న పాత్రలతో సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసి, ప్రేక్షకులను మెప్పించిన ఈ నటుడు.. మరి మహారాష్ట్ర ఓటర్లను ఒప్పిస్తారో లేదో కొద్ది నెలల్లో తెలుస్తుంది.