దేశరాజధానిలో దారుణం.. జిమ్ ఓనర్‌ను కత్తితో పొడిచి చంపిన దుండగులు

దేశరాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు జిమ్ ఓనర్‌ను కత్తితో పొడవడంతో పాటు, అతని ముఖంపై 21 సార్లు కత్తితో దాడి చేయగా అతను మృతి చెందాడు.

Update: 2024-07-11 03:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు జిమ్ ఓనర్‌ను కత్తితో పొడవడంతో పాటు, అతని ముఖంపై 21 సార్లు కత్తితో దాడి చేయగా అతను మృతి చెందాడు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో జరిగింది. 28 ఏళ్ల సుమిత్ చౌదరి అలియాస్ ప్రేమ్ జిమ్‌ను నడుపుతూనే, టూర్ అండ్ ట్రావెల్ వ్యాపారం చేస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి అతను గామ్రీ ఎక్స్‌టెన్షన్‌లోని తన ఇంటి బయట ముగ్గురు-నలుగురు వ్యక్తులతో గొడవ పడ్డాడు. దీంతో వారు కత్తితో అతడి ముఖం, మెడ, ఛాతీ, పొత్తికడుపుపై ​పలుమార్లు పొడిచారు. ముఖంపై దాదాపు 21 సార్లు కత్తితో దాడి చేశారు. దాడి చేసిన తరువాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితున్ని వెంటనే జేపీసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ ఈస్ట్) జాయ్ టిర్కీ మాట్లాడుతూ, సుమిత్ చౌదరి హత్యాయత్నం కేసులో దోషిగా తేలి బెయిల్‌పై ఇటీవల బయటకు వచ్చారని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. సుమిత్ చౌదరికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు.


Similar News