మోడీకి అభినందనల వెల్లువ..శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచాధినేతలు వీరే?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దేశంలో మూడో సారి విజయం సాధించిన నేపథ్యంలో మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దేశంలో మూడో సారి విజయం సాధించిన నేపథ్యంలో మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే మోడీకి ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతానికి మోడీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మోడీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే నేపాల్ ప్రధాని పుష్పకమల్ ప్రచంచ కూడా ఎక్స్ వేదికగా మోడీని అభినందించారు. ‘వరుసగా మూడోసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోడీకి అభినందనలు. భారతదేశ ప్రజల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తును విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధం: మొహమ్మద్ ముయిజ్జు
భారత్తో దౌత్యపరమైన వివాదాలు రేపిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ కూడా మోడీ విజయంపై స్పందించారు. ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అభినందనలు.భాగస్వామ్య ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్లు కూడా అభినందనలు తెలిపారు.