పశువుల కొట్టంలో మూడు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

మహారాష్ట్రలో జనవాసాల్లోకి వచ్చిన ఓ చిరుత పశువుల కొట్టంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

Update: 2024-08-06 14:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో జనవాసాల్లోకి వచ్చిన ఓ చిరుత పశువుల కొట్టంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. చంద్రపూర్ జిల్లా నాగభీడ్ తాలూకా బాలాపూర్ లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ చిరుత సంచరిస్తోంది. అది ఇప్పటికే ఆరుగురిపై దాడి చేయగా ఒకరు మృతి చెందారు. గ్రామాల్లోని పలు పశువుల పైనా దాడి చేసి హతమార్చింది. సోమవారం బాలాపూర్ గ్రామ సరిహద్దుల్లోని రైతు దిందేవ్ సలోటేకు చెందిన పశువుల కొట్టంలో చిరుత ఉన్నట్టు గ్రామస్తులు గుర్తించారు. దాన్ని హతమార్చేందుకు అక్కడికి వెళ్ళిన గ్రామస్తులకు ఆ పూరి గుడిసెలో మూడు చిరుత కూనలు కనిపించాయి. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వాటిని సంరక్షణా కేంద్రానికి తరలించారు. త్వరలోనే ఆ చిరుతను కూడా పట్టుకొని పిల్లల దగ్గరికి చేరుస్తామని డీఎఫ్ఓ తెలియజేశారు.  


Similar News