మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2023-06-26 12:12 GMT

ముంబై : మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ట్రక్కు .. ఆటోపైకి దూసుకెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం అసుద్ గ్రామం పరిధిలోని దాపోలి-హర్నై రోడ్డుపై జరిగిన ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఆటోలోని ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. గాయాలపాలైన ఇంకో ఏడుగురికి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. మృతుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.


Similar News