వామ్మో.. ‘రాజన్న’ సినిమాలో చిన్నారి.. అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లయిందో మీరే చూడండి!

నాగార్జున హీరోగా నటించిన ‘రాజన్న’ సినిమా మీరు చూసే ఉంటరు. ఇందులో కథ, కథనంతో పాటు తెలంగాణ యాస, భాష, పాటలు మస్తు ఆకట్టుకున్నయ్.

Update: 2024-06-07 13:46 GMT

దిశ, సినిమా : నాగార్జున హీరోగా నటించిన ‘రాజన్న’ సినిమా మీరు చూసే ఉంటరు. ఇందులో కథ, కథనంతో పాటు తెలంగాణ యాస, భాష, పాటలు మస్తు ఆకట్టుకున్నయ్. ఇగ ‘అమ్మా.. అవనీ.. నేలతల్లీ యనీ’ మల్లమ్మ పాత్రలో నటించిన ఓ చిన్న పిల్ల పాడిన పాటైతే ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది. ఇప్పుడెందుకు చెప్పుకోవడం అనుకుంటున్నరా.. మరేం లేదు గానీ.. అప్పట్లో బుడ్డపోరి లెక్కన నటించి మస్తుగా ఆకట్టుకున్న ఆ చిన్నారి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాల మస్తు వైరల్ అవుతున్నయ్.

నాడు ఐదేంట్ల పిల్లగా కనిపించిన ‘మల్లమ్మ’ ఎంతలా మారిపోయిందంటే.. ఫొటో కింద పేరు జూస్తే గానీ.. ‘అయ్యో గా పిల్లనా.. గుర్తు పట్టలేనంత మారిపోయింది గదా.. చిన్నపిల్లగా నటించిన ‘మల్లమ్మ’ ఇంత పెద్దగయిందా!.. అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లయింది సూడున్రి’ అని మస్తు పరేషాన్ అయితున్రు జనాలు. ఇంతకీ ఆమె అసలు పేరు ఏందంటే.. అన్నీ.. అనుకోకుండా ఒక రోజు సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ఈ అన్నీ ఎన్నో సినిమాల్లో బుడ్డపోరి లెక్కన నటించి మెప్పించింది.

రామ్ చరణ్ హీరోగా నటించిన రంగ స్థలం సినిమాలో కూడా అతనికి చెల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. విక్రమార్కుడు సినిమాతో అన్నీకి మరింత మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన్నీ ఎప్పటికప్పుడు అభిమానులతో కొత్త కొత్త ముచ్చట్లను పంచుకుంటూ ఉంటుంది. అట్లనే రాజన్న సినిమాలో నటించినప్పుడు ఎట్లుండెనో.. ఇప్పుడెట్లయిందో తెలియజేసే ఫొటోలు కూడా షేర్ చేయగా మస్తు వైరల్ అవుతున్నయ్.


Similar News