‘పురుషాంగానికి పాకులాట ఎక్కువ’ అంటున్న హీరోయిన్.. ఆసక్తికరంగా ‘శ్వాగ్’ ట్రైలర్
యంగ్ హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్టైనర్ 'శ్వాగ్'.
దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్టైనర్ 'శ్వాగ్'. ఇందులో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చెయ్యగా.. తాజాగా ట్రైలర్ను రిలజ్ చేశారు చిత్ర బృందం.
‘మగవాడి ప్రయాణం.. 1551 సంవత్సరం నుండి’ అని స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఆధారంగా చూసుకుంటే.. ఇది 1551లో మొదలై ప్రస్తుతం వరకు దాదాపు నాలుగు టైమ్ లైన్స్లో ఉండే ఓ డిఫరెంట్ కాన్సె్ప్ట్గా అర్థం అవుతోంది. ఇందులో శ్రీవిష్ణు.. సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథ పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగా తీసినట్లు తెలుస్తుండగా.. అచ్చ తెలుగు డైలాగ్స్ మూవీపై ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తున్నాయి. అలాగే.. హీరోయిన్ రీతూ వర్మ ‘పురుషాంగానికి పాకులాట ఎక్కువ’ అనే డైలాగ్ యూత్కు కిర్రాక్ అనిపించేలా ఉన్నాయి. పితృస్వామ్యం, మాతృస్వామ్యం మధ్య జరిగే ఆధిపత్య పోరుగా కనిపించిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కాగా.. ‘శ్వాగ్’ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.