మరికాసేపట్లో నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తెకు అంత్య క్రియలు
స్టార్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కుమార్తె గాయత్రి(Gayathri) శనివారం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: స్టార్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కుమార్తె గాయత్రి(Gayathri) శనివారం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో నటుడు కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కేపీహచ్బీలోని ఇందు విల్లాస్లో రాజేంద్రప్రసాద్ను ఓదార్చి కుమార్తెకు నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే ఆయన కుమార్తె అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. కాగా KPHBలోని కైలాసవాసంలో గాయత్రి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది.