మరోసారి డిప్యూటీ సీఎంపై పరోక్షంగా సెటైర్లు వేసిన ప్రకాశ్‌రాజ్

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసినప్పటినుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు, స్టార్ యాక్టర్ ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj)కు ట్విట్టర్(x) వేదికగా మినీ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-06 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసినప్పటినుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు, స్టార్ యాక్టర్ ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj)కు ట్విట్టర్(x) వేదికగా మినీ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’ (Just Asking)అంటూనే ప్రకాశ్ రాజ్ ఎక్స్‌లో పవన్ కళ్యాణ్‌పై వరుస పోస్టులతో దాడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి డిప్యూటీ సీఎంపై పరోక్షంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రకాశ్‌రాజ్ ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. "తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి(Tamil Nadu deputy cm Udhayanidhi) సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరొక సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాది సమానత్వం. నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడతా" అని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Similar News