దిశ, సినిమా: ప్రముఖ నటి, మోడల్ నేహా ధూపియా ‘నింజా ఓడూరు’ అనే జరనీస్ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగులో ‘నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమ వీర చక్ర’ వంటి సినిమాలు చేసి అలరించింది. అయితే.. ప్రజెంట్ ఈ బ్యూటీ ‘బ్యాడ్ న్యూస్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్, అమ్మి విరాక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్లో భాగాంగా.. తన ఫిట్నెస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కవగా బరువు పెరిగిన నేహా ధూపియా.. దాదాపుగా 23 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘2018లో అంగద్ బేడీని పెళ్లి చేసుకున్నారు. ప్రజెంట్ ఇద్దరు పిలల్లకు తల్లిని. డెలవరీ తర్వాత ఫిట్నెస్ గురించి ఆలోచించలేదు. పిల్లలకు ఏడాది వచ్చేవరకు పాలిచ్చాను. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టకపోవడంతో 25 కొలోల బరువు పెరిగాను. తర్వాత ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ఇక ఫిట్నెస్పై దృష్టి పెట్టి ఏకంగా 23 కిలోలు తగ్గాను. దీని కోసం ఎక్కువగా కష్టపడలేదు. రోజు రన్నింగ్ చేసేదాన్ని. జిమ్కి వెళ్లా. షుగర్, ఫ్రై లాంటివి డైట్లో లేకుండా చూసుకోవడంతో పాటు.. రాత్రి 7 గంటలకు డిన్నర్ పూర్తి చేసేదాన్ని. ఇప్పటికి అదే ఫాలో అవుతున్న. బరువు తగ్గడంతో ఆఫర్లు కూడా వస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది.