అన్న తోపు.. చెప్పింది చేశాడంటూ.. పవన్ కళ్యాణ్‌పై సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-04 11:05 GMT

దిశ, సినిమా : ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 70 వేల మెజార్టీతో గెలుపొందిన పవన్ ఇటు రాజకీయ, అటు సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. అతని గెలుపుతో ఫ్యాన్స్ అందరూ సంబురాలు చేసుకుంటున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

తాజాగా ‘సుప్రీం’ మూవీ హీరో సాయిధరమ్ తేజ్ కూడా పవన్‌ కళ్యాణ్‌పై ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘అన్న తోపు అనుకున్నది చేశాడు. మనల్ని ఎవడ్రా ఆపేది’ అని పేర్కొంటూ పవర్ స్టార్ ఫుల్ వీడియోను అతను షేర్ చేయగా.. ప్రజెంట్ ఇది వైరల్ అవుతోంది. ఇక సాయిధరమ్ తేజ్‌తోపాటు హీరో నితిన్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మెగా ఫ్యామిలీలో అయితే పండుగ వాతావరణం నెలకొంది. పవన్ అభిమానుల ఆనందానికైతే హద్దుల్లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ ఫొటోలకు ఆకట్టుకునే క్యాప్షన్స్ ఇస్తూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు.  


Similar News