ప్రభాస్ ‘కల్కి’ సినిమా టికెట్ రేట్లు పెంపు.. ఒక్క దాని ధర ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘కల్కి2898ఏడి’. అయితే ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Update: 2024-06-23 04:11 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘కల్కి2898ఏడి’. అయితే ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రియులు కల్కి విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూన్ 27 వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మూవీ టికెట్ ధరలు పెంపునకు మేకర్స్ తెలంగాణ ప్రభుత్వంను అనుమతి కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినీ ప్రియులకు షాకిచ్చింది. సింగిల్ స్క్రీన్‌పై రూ. 75, మల్టీఫ్లెక్స్‌లో రూ. 100 చొప్పున ధరలు పెంచుకోవచ్చని తెలిపినట్లు సమాచారం. అయితే జూన్ 27 ఉదయం పడే బెనిఫిట్ షోకు రూ. 200 పెంపు అదనంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో కల్కి మూవీకి ఫుల్ సపోర్ట్ లభించినట్లు అయింది.

ఈ లెక్కన చూస్తే కల్కి బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్‌‌‌పై రూ. 377, మల్టీఫ్లెక్స్‌లో రూ. 495 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మిగతా రోజుల్లో సింగిల్ స్క్రీన్‌పై రూ. 265, మల్టీఫ్లెక్స్‌లో రూ. 413 అలాగే ఆన్‌లైన్‌లో త్రీడి గ్లాస్ చార్జీలు కలిసి ఒక్క టికెట్ రూ. 500 ఖర్చు అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన డార్లింగ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.


Similar News