పల్లవి ప్రశాంత్ చీకటి బాగోతాలు బట్టబయలు..రైతు పేరుతో లక్షలు సంపాదన!

బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్‌పై అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. తాజాగా ఈయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నాడని, ఆయన రైతుల పేరు చెప్పుకొని డబ్బు సంపాదిస్తున్నాడు.

Update: 2024-05-12 04:10 GMT

దిశ, సినిమా : బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్‌పై అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. తాజాగా ఈయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నాడని, ఆయన రైతుల పేరు చెప్పుకొని డబ్బు సంపాదిస్తున్నాడు.. ఆయన చీకటి బాగోతాలు ఎవరికి తెలియవు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్

పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ 7 సీజన్‌లోకి ఓ సామాన్యమైన రైతు బిడ్డగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన తన ఆటతీరు, అలాగే ఒక సామాన్యుడు బిగ్ బాస్‌లోకి వెళ్లాడు తనను గెలిపించకోవాలని జనాలు ఓట్లు వేసి అతన్ని విన్నర్ చేశారు.. దీంతో ప్రశాంత్ చాలా ఎమోషనల్ అవుతూ.. నా టైటిల్ ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు పంచుతాను అంటూ హామి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆయన డబ్బులు పంచలేదు. రీసెంట్‌గా ఒక లక్ష రూపాయలు మాత్రం పంచిన పల్లవి ప్రశాంత్ పెద్ద హంగామా చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన డబ్బు పంచడం అనే ఆలోచనలోనే లేనట్లు తెలుస్తోంది అంటున్నారు నెటిజన్స్.

దీంతో ఆయనను జనాలు ఏకిపారేస్తున్నారు. బిగ్ బాస్‌ హౌస్‌కు రైతుల పేరు చెప్పుకొని వెళ్లి, విన్నర్ అయ్యావు. 15లక్షల కారు, విలువైన బంగారు హారం సంపాదించుకున్నావు. 35 లక్షలు సంపాదించావు.. డబ్బులు పేద రైతులకు ఇస్తానంటూ అబద్ధాలు చెబుతావా.. నీ చీకటి బాగోతాలు తెలియడం లేదు అనుకుంటున్నావా.. లక్ష పంచి మళ్లీ ఫేమ్ సంపాదించుకోవాలని చూస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే ప్రస్తుతం ప్రశాంత్..భారీగా సంపాదిస్తున్నట్లు సమాచారం. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే రూ. 2 లక్షలకు పైగా తీసుకుంటున్నాడట. పల్లవి ప్రశాంత్ సంపాదన నెలకు రూ. 20 నుండి 30 లక్షలు అంటున్నారు.


Similar News