నా ఆత్మీయుడితో మళ్లీ కలిశాను.. ఛార్మీ పోస్ట్‌కు షాక్ అవుతున్న నెటిజన్లు!

‘నీతోడు’ కావాలి అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఛార్మీ కౌర్.

Update: 2024-07-07 14:44 GMT

దిశ, సినిమా: ‘నీతోడు’ కావాలి అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఛార్మీ కౌర్. 14 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఎన్నో మూవీస్ చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తమిళంతో తెలుగులో కూడా వరుస మూవీస్ చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేసేది. ఇక లాస్ట్‌గా 2013లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘సేవకుడు’ చిత్రంలో కనిపించిన ఛార్మీ.. అప్పటి నుంచి వెండితెరకు దూరమైంది. తర్వాత 2022లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది ఈ బ్యూటీ. కానీ ఈ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో కోలుకోలేని దెబ్బతగినట్లు అయింది.

అయినా ఏమాత్రం తగ్గని హీరోయిన్.. ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కు కూడా నిర్మాతగా వ్యవహరిస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు దీని సీక్వెల్‌పై వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ పై డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఛార్మీ ఓ పోస్ట్ పెట్టింది. ‘నా ఆత్మీయుడితో మళ్లీ కలిశారు’ అంటూ పోస్ట్ పెట్టింది. ఇందులో హీరోయిన్ తన కంటే పెద్ద సైజ్‌లో ఉన్న కుక్కతో ఉన్న ఫొటో షేర్ చెయ్యడంతో.. డాగ్ సైజ్‌ను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు.


Similar News