త్రివిక్రమ్‌తో మూవీ.. షూటింగ్ మధ్యలో ఆపేసిన మహేష్.. కారణం?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ గత వారమే ప్రారంభమైంది.

Update: 2022-09-21 14:11 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ గత వారమే ప్రారంభమైంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 'కేజీఎఫ్' ఫైట్ మాస్టర్ అన్బరివ్‌ని తీసుకొచ్చారు.

కానీ వారి వర్క్ విషయంలో మహేష్ బాబు సంతృప్తికరంగా లేకపోవడంతో షూటింగ్‌కు బ్రేక్ పడిందని టాక్. కాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. 'ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. భారీ యాక్షన్‌ సీన్స్‌ని అన్బరివ్‌ ఫైట్‌ మాస్టర్స్‌తోనే విజయవంతంగా పూర్తి చేశాం. ఇంతటి అద్భుతమైన ఫైట్‌సీన్లు కంపోజ్‌ చేసిన మాస్టర్స్‌కు థాంక్స్. సెకండ్‌ షెడ్యూల్‌ దసరా తర్వాతే ప్రారంభమవుతుంది. ఇందులో మహేష్‌తోపాటు పూజా హెగ్డే కూడా పాల్గొనబోతోంది' అని తెలిపారు. 

Tags:    

Similar News